రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ‘వలయం’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్కప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ను చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. హీరో భార్య కనపడకుండా పోతుంది.ఆమెకు ఉన్న లవ్ ఎఫైర్ కారణంగా హీరోనే చేంపేశాడని పోలీసులు అనుమానిస్తుంటారు. ఉన్న ఆధారాల ఆధారంగా హీరో ఆమెను ఎలా కనుగొన్నాడనేదే కథాంశం అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ అయితే అక్కట్టుకుంటుంది. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం..
కాగా ఈ సినిమాలో ఇంకా రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటించనున్నారు. బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగుప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: