శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ , దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “ఈగ ” తో విలన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన “దబాంగ్ 3” మూవీ ద్వారా బాలీవుడ్ కు విలన్ గా సుదీప్ పరిచయం అయ్యారు. సుదీప్ ఇప్పుడు కోలీవుడ్ కు విలన్ గా ఎంటర్ కానున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు , కళ్యాణి ప్రియదర్శన్ జంటగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ “మానాడు “తమిళ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో విలన్ పాత్రకి సుదీప్ ను మేకర్స్ సంప్రదించారని సమాచారం. సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. జనవరి లో ప్రారంభం కానున్న “మానాడు ” మూవీ లో సీనియర్ దర్శకులు భారతీ రాజా, ఎస్ ఏ చంద్ర శేఖర్ ముఖ్య పాత్రలలో నటించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: