‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టీమ్ రోమ్ వెళ్లినట్టు తెలుస్తుంది. పాటల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: