‘పింక్’ రీమేక్ అని ఎప్పుడైతే వార్త బయటకి వచ్చిందో అప్పటినుండి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే వుంది. తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టు వార్తలు రాగా ఇప్పుడు తాజాగా మల్లేశం సినిమాలో నటించిన తెలుగమ్మాయి అనన్య కూడా పవన్ పింక్ రీమేక్ లో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్లేశం సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. మరి తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: