లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూసిన కార్తీ ఎదురుచూపులు ఫలితం దక్కింది.ఇక ‘ఖైదీ’ అయిపోయింది.. ఇప్పుడు ‘దొంగ’ గా వచ్చేస్తున్నాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఇది. తమిళంలో ‘తంబి’ గా వస్తుండగా… తెలుగులో ‘దొంగ’ టైటిల్ తో వస్తుంది.ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్న ఈ సినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీ రియల్ లైఫ్ వదిన, హీరో సూర్య భార్య అయిన జ్యోతిక కార్తీకి అక్కగా నటిస్తోంది. వీరితో పాటూ మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: