నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధంగా వుంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. హైదరాబాద్ లోని, మాదాపూర్ దస్పల్లా హోటల్ లో రేపు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ ముఖ్య అతిధిగా రానున్నారు.
కాగా ఇంకా ఈ సినిమాలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ పతాకంపై జి. వి. జి. రాజు సమర్పణలో శ్రీరామ్ రాజు, భరత్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గిప్తాన్ ఎలైస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: