టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఏఎంబీ సినిమాస్ కు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వెరీ హ్యాపీ బర్త్ డే ఏషియన్ సినిమాస్ అంటూ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమించి ఏఎంబీ సినిమాస్ ను ఈ స్థాయికి తెచ్చిన ఏఎంబీ టీమ్ కు శుభాభినందనలు. ఏఎంబీ సినిమాస్ నేడు ఈ స్థాయిలో ఉందంటే అది మీ చలవే అంటూ స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
AMB turns one! Wishing @amb_cinemas a very happy birthday and Big congratulations team AMB for all the hardwork you have put in 👏👏👏👍👍👍 Thank you each one of you who have enjoyed this movie going experience at AMB and for making AMB what it is today! pic.twitter.com/XotpMZQdlf
— Mahesh Babu (@urstrulyMahesh) December 2, 2019
కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది. కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: