ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కగా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ బయోపిక్ విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ తెరకెక్కిన పలువురి ప్రముఖుల బయోపిక్ లు ఒక్కటి మాత్రమే తెరకెక్కాయి. కానీ ఒక్క జయలలిత బయోపిక్ పై మాత్రం మూడు సినిమాలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏ ఎల్ దర్శకత్వంలో ‘తలైవి’ పేరుతో ఒక సినిమా రూపొందిస్తుండగా ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తుంది.మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తుంది. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవితం ఆధారంగా మరో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇక్కడి వరకూ బాగానే వున్నా ఇప్పుడు ఈ బయోపిక్ పై నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. రీసెంట్ గా నిత్యా మరో షాకింగ్ కామెంట్ కూడా చేసింది. జయలలిత బయోపిక్ కి తాను మాత్రమే కరెక్ట్ గా సెట్టవుతానని ఇన్ డైరెక్ట్ గా కంగనాకు మిగతా నటీనటులకు కౌంటర్ ఇచ్చింది. కంగనా పేరు ప్రస్తావించకపోయినా ఆమె టీజర్ విడుదలైనప్పుడే ఇలాంటి కామెంట్ చేయడం కాంట్రవర్సీగా మారుతోంది. మరి నిత్యా కామెంట్ కంగనా వరకు వెళ్తే కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: