రాజమౌళి సినిమాలో నటించే ఎవరికైనా తక్కువ టైం లో ఎక్కువ గుర్తింపు వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రాజమౌళి సినిమాలో తక్కువ పాత్ర వున్నా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇక్కడ నటీనటులకే కాదు… ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ తో హాలీవుడ్ నటీనటులకు కూడా ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. రెండు రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ను, విలన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఒలివియా మోరిస్’
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ‘ఒలివియా మోరిస్’ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఒలివియా మోరిస్’ గురించి చెప్పాలంటే… లండన్ లో పుట్టి పెరిగిన ఒలివియా నటి మాత్రమే కాదు మోడల్ కూడా. అంతే కాదు ఒలీవియా మోరిస్ థియేటర్ ఆర్టిస్ట్ కూడా. నటనపై వున్న ఇష్టంతో పలు సీరియల్స్, షోస్ లలో చేసింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో జెన్నీఫర్ పాత్ర పోషిస్తుంది. తొలిసారి ఆర్ఆర్ఆర్తో వెండితెరకి పరిచయం అవుతుంది.
రే స్టీవెన్సన్
ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో రే స్టీవెన్సన్ నటిస్తున్నాడు. రే స్టీవెన్సన్ ఐరిష్ దేశానికి చెందిన సినీ యాక్టర్. 1998 లోవచ్చిన ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ హాలీవుడ్ వెండితెరకు పరిచయమైన రే.. ఆ తర్వాత ‘ఔట్ పోస్ట్’. ‘పనిషర్’, ‘వార్ జోన్’, ‘బిగ్ గేమ్’, ‘కోల్డ్ స్కిన్’, ‘ఫైనల్ స్కోర్’, ప్రఖ్యాత థార్ సిరీస్లో నటించాడు. ఇంకా పలు టెలివిజన్ షోస్లో కీలక పాత్రల్లో నటించాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో రే బ్రిటీష్ అధికారి స్కాట్ పాత్రలో కనిపించనున్నాడు.
అలిసన్ డూడీ
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలిసన్ డూడీ లేడీ స్కాట్ పాత్రలో నటించబోతున్నారు. ఈ పాత్రలో ప్రముఖ ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. మోడల్ నుంచి నటిగా మారిన ఈ 53 ఏళ్ల ఐరిష్ భామ పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. 1985 లో ‘ఏ వ్యూ తో ఎ కిల్’ సినిమాతో అరంగేట్రం చేసిన అలిసన్ డూడీ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు పలు టీవీ సిరీసుల్లోనూ నటించారు. ఇప్పుడు RRR ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నారు.
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ ముగ్గురు విదేశీ నటులు త్వరలోనే RRR షూటింగ్లో పాల్గొంటారు. ఒకే షెడ్యూల్లో ఈ ముగ్గురితో షూటింగ్ పూర్తిచేయనున్నట్టు సమాచారం.ఇక మిగిలిన భాగం అంతా ఈ ముగ్గురు నటీనటులతో కూడిన సన్నివేశాలే ఉంటాయని టాక్. ఈ షెడ్యూల్ కూడా అయిపోతే ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత గ్రాఫిక్స్ పనులు ఉంటాయి కాబట్టి.. ఐదారు నెలల్లో వాటిని పూర్తిచేసి వచ్చే ఏడాది జులై 30న సినిమాను విడుదల చేస్తారు. ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: