`సుప్రీమ్` జోడి సాయితేజ్, రాశీఖన్నా మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. కుటుంబ బంధాలు, మానవ విలువల నేపథ్యంలో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాతో… దర్శకుడు మారుతి తనయ అభీష్ట తెరంగేట్రం చేయబోతోంది. ఇందులో రాశీఖన్నా ముగ్గురు చెల్లెళ్ళలో ఒకరిగా అభీష్ట కనిపించనుందని సమాచారం. మరి.. తన గారాల పట్టి అభీష్ట పాత్రను మారుతి ఎలా డిజైన్ చేసాడో చూడాలంటే… డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: