యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్ళ తరువాత ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1970ల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ… ఇటలీ నేపథ్యంలో రూపొందుతోంది. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిలా ఉంటే… ఆ మధ్య ఇటలీలో భారీ షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం… ఈ నెల 18 నుంచి తదుపరి షెడ్యూల్ ని జరుపుకోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. కాగా… దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న `ప్రభాస్ 20` కోసం… ఏకంగా 25 రెట్రో సెట్స్ డిజైన్ చేస్తున్నారట. వింటేజ్ ఇటలీని ప్రతిబింబిస్తూ తీర్చిదిద్దుతున్న ఈ సెట్స్ లోనే… ఈ సినిమాకి సంబంధించిన సింహభాగం చిత్రీకరణ జరుగుతుందని టాక్. మరి… రికార్డు స్థాయిలో ప్రొడక్షన్ డిజైన్ టీమ్ తీర్చిదిద్దుతున్న ఈ రెట్రో సెట్స్… చిత్రానికి ఏ స్థాయిలో ప్లస్ అవుతాయో తెలియాలంటే రిలీజ్ వరకు వేచిచూడాల్సిందే.
గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న `ప్రభాస్ 20`… 2020 ద్వితీయార్ధంలో థియేటర్లలోకి రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: