వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు సుమంత్. ‘మళ్లీరావా’ సినిమాతో ట్రాక్లోకి వచ్చిన సుమంత్ ఆ తర్వాత వచ్చిన ‘ఇదంజగత్’ ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలు తీసినా అవి సరిగా విజయం దక్కించుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈ సారి రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిజు మీనన్ హీరోగా 2018లో మలయాళంలో వచ్చిన ‘పాదయోట్టం’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమానే సుమంత్ రీమేక్ చేస్తున్నాడు. విను యజ్ఞ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై తమ్మినేని జనార్థన రావు, శర్మ చుక్క నిర్మించనున్నారు. ఈ సినిమాతో ఐమా హీరోయిన్గా పరిచయం కానుంది. కాగా ‘గ్యాంగ్స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 15 నుంచి మొదలు కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: