రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా ఓ సంచలనమే.. రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా… వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తాడు. సినిమా టైటిల్ తోనే సినిమాకు ఎక్కడా లేని హైప్ ను తీసుకొస్తాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అయితే ఏంటి, ఇప్పుడు వస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అయితే ఏంటి సినిమా రిజల్ట్ పక్కన పెడితే టైటిల్ తోనే వివాదాలు సృష్టిస్తాడు వర్మ. ఇక రీసెంట్ గానే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే కొంతమంది రాజకీయ నాయకులను పరోక్షంగా టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ‘మెగా ఫ్యామిలీ’ అంటూ అర్ధరాత్రి ట్వీట్ చేసి షాకిచ్చాడు. తన తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అని… పూర్తి వివరాలను రేపు ప్రకటిస్తానని అర్ధరాత్రి ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. దాంతో మీడియా మొత్తం ఈ రోజు మెగా కుటుంబంపై తీయబోయే ఆ చిత్రం ఏమిటి, దాన్ని ఏ కోణంలో తీస్తారు..ఏ మెగా హీరోని టార్గెట్ చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అంతేకాదు మెగాభిమానులు సైతం ఆయన ట్వీట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూసారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన షాకిచ్చాడు.
ఏమైందో ఏమో కానీ మళ్ళీ ‘మెగా ఫ్యామిలీ’ సినిమాను తాను తెరకెక్కించడం లేదని మరో ట్వీట్ చేశాడు. అంతే కాదు అసలు ఇది ‘మెగా ఫ్యామిలీ’ అనేది 39 మంది పిల్లలు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన చిత్రమని చెప్పారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారని… పిల్లల సినిమాలను చిత్రీకరించడంలో తనకు అనుభవం లేదని… అందుకే ఈ సినిమాను తెరకెక్కించకూడదని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. మరి అర్థరాత్రి ఎందుకు ట్వీట్ చేసినట్టు.. ఉదయాన్నే ఎందుకు మాట మార్చాడో వర్మ కే తెలియాలి..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: