తెలుగునాట తండ్రీకూతుళ్ల అనుబంధంతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో… ముందువరుసలో నిలిచే చిత్రాలలో ‘నువ్వే నువ్వే’ ఒకటి. తరుణ్, శ్రియా శరన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారానే నేటి అగ్రశ్రేణి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్దేశకుడిగా తొలి అడుగులు వేశాడు. ఇందులో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, సునీల్, సుధ, ప్రగతి, అనితా చౌదరి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన గీతాలకు సంగీత దర్శకుడు కోటి వీనులవిందైన బాణీలు అందించారు. “నువ్వే నువ్వే కావాలంటుంది”, “నా మనసుకేమయింది”, “ఐ యామ్ వెరీ సారీ”, “అమ్మాయి నచ్చేసింది”, “నిద్దుర పోతున్న”, “కంప్యూటర్లు”… ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను రంజింపచేసింది. `ఉత్తమ ద్వితీయ చిత్రం`, `ఉత్తమ మాటల రచయిత` (త్రివిక్రమ్) విభాగాల్లో `నంది` పురస్కారాలను కైవసం చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని… శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించాడు. 2002 అక్టోబర్ 10న విడుదలై మ్యూజికల్ హిట్గా నిలచిన ‘నువ్వే నువ్వే’… నేటితో 17 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే… దర్శకుడిగా త్రివిక్రమ్ ప్రయాణం మొదలై నేటితో 17 వసంతాలు పూర్తవుతుందన్నమాట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: