సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో మహేష్, కొంతమంది ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. దీంతో… దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. కాగా… ప్రస్తుతం చిత్రీకరణకు కొంత బ్రేక్ ఇచ్చిన యూనిట్… త్వరలోనే తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు… ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను దీపావళి కానుకగా అక్టోబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.
దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో రూపొందుతున్న `సరిలేరు నీకెవ్వరు`… 2020 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: