`ఛలో`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రష్మిక మందన్న. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… మలి చిత్రం `గీత గోవిందం`తో స్టార్డమ్ని సొంతం చేసుకుంది. కాగా… ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు క్రేజీ ప్రాజెక్ట్స్లో నాయికగా నటిస్తోంది. అయితే… వాటిలో రెండు సినిమాలు తక్కువ గ్యాప్లోనే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `భీష్మ`, `సరిలేరు నీకెవ్వరు`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఛలో` తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న చిత్రం `భీష్మ`. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లోపే… సూపర్ స్టార్ మహేష్ బాబుకి జంటగా రష్మిక నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` విడుదల కానుంది. 2020 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రానుంది. మరి… తక్కువ గ్యాప్లోనే అది కూడా ఫెస్టివల్ సీజన్స్లోనే వస్తున్న రష్మికకి కొత్త చిత్రాలు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: