సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది సోయగం కియారా అద్వాని. ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టారర్ `వినయ విధేయ రామ`లోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం కియారా పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. కాగా… సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ… ఇప్పుడు కోలీవుడ్లోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్లో 64వ చిత్రంగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో… కియారా అద్వాని హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు కోలీవుడ్ టాక్. త్వరలోనే కియారా కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి… తెలుగునాట మహేష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్బస్టర్ అందుకున్న కియారా… తమిళంలోనూ స్టార్ హీరో విజయ్తో తొలి అడుగులు వేస్తున్న వైనం కలిసొస్తుందేమో చూద్దాం.
కాగా… కియారా అద్వాని తాజా హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’(‘అర్జున్ రెడ్డి’కి రీమేక్) బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే.
[subscribe]
[youtube_video videoid=WJ8Mug7kAiw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: