వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ధరిపల్లె అనే గ్రామంలో షూటింగ్ జరుపుకుంటుండగా అది పూర్తయింది. రెండో షెడ్యూల్ అప్ డేట్ త్వరలోనే ఇవ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా ఈ మూవీని దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు… సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫిగా పనిచేస్తున్నారు.
ఇంకా ఈసినిమాలో టబు, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
[subscribe]
[youtube_video videoid=09CDzuJbjeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: