దివంగత నటుడు రియల్ హీరో శ్రీహరి చిన్న తనయుడు మేఘాంశ్ హీరోగా కార్తిక్-అర్జున్ దర్శకత్వంలో ‘రాజ్ దూత్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సంగతి ఎలా ఉన్నా… మేఘాంశ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మేఘాంశ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తండ్రి శ్రీహరి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనని హీరోగా చూడడం నాన్న కల అని.. ఆయన ఉండుంటే బావుండేది అని మేఘాంశ్ తెలిపాడు. నాన్న ఉండుంటే నటనలో నాకు గైడెన్స్ ఇచ్చేవారు అని మేఘాంశ్ తెలిపాడు. నాన్న దూరమైన తర్వాత అమ్మ తరుపున వాళ్ళు, నాన్న తరపున వాళ్ళు అన్ని చూసుకున్నారని మేఘాంశ్ తెలిపాడు.
ఇక అదే సందర్భంలో తన విషయంలో జూ.ఎన్టీఆర్ గురించి వస్తున్న వార్తలపై కూడా స్పందిస్తూ.. జూ. ఎన్టీఆర్ తమకు సాయం చేశాడని తాను చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు.
[youtube_video videoid=jdNOXnee7Es]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: