సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా… జూలై 5 నుంచి జమ్ము, కాశ్మీర్లో తొలి షెడ్యూల్ను జరుపుకోనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో భాగంగా… మహేష్పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… మిలటరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్గా దర్శనమివ్వనున్నాడు. కాగా… పాత్ర డిమాండ్ మేరకు కోర మీసంతో పాటు మిలటరీ హెయిర్ కట్తోనూ మహేష్ కనిపించనున్నాడని టాక్. మొత్తమ్మీద… `మహర్షి` తరహాలోనే `సరిలేరు నీకెవ్వరు`లోనూ మహేష్ సరికొత్త లుక్లో దర్శనమివ్వనున్నాడన్నమాట.
‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్… 2020 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: