ఈ వేసవికి విడుదలైన ‘చిత్రలహరి’తో మెమరబుల్ హిట్ అందుకున్న మెగాహీరో సాయి తేజ్… మారుతి దర్శకత్వంలో ‘ప్రతీ రోజు పండగే’ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రం చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా… ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉంటే… తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ మెగాహీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… గతంలో ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్ని అందించిన దర్శకుడు దేవా కట్టా… మరోసారి అటువంటి డిఫరెంట్ అండ్ సీరియస్ సబ్జెక్ట్ను రెడీ చేసాడట. ఈ నేపథ్యంలో తేజుని సంప్రదించి స్క్రిప్ట్ను కూడా వినిపించాడట దేవా. తేజుకి కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని టాలీవుడ్ టాక్. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలువడే అవకాశం ఉంది.
వరుస పరాజయాల తర్వాత ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తేజు… ఇప్పుడు వరుసగా కంటెంట్ ఉన్న డైరెక్టర్స్తో డిఫరెంట్ మూవీస్ చేయడం అతనికి కలిసొచ్చే అంశమే. మున్ముందు ఈ టాలెంటెడ్ హీరో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలతో అలరించాలని కోరుకుందాం.
[youtube_video videoid=nqBj0TOSK_c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: