మెగా హీరోలు ఈ మధ్య కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతున్నారు. తమ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే.. తమ ఓటమిని అంగీకరిస్తూ అభిమానులకు సారీ చెబుతున్నారు. ఇటీవల వినయ విధేయ రామ సినిమా ఘోర పరాజయం నేపథ్యంలో రామ్ చరణ్ తన అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖను రాశారు. ఇప్పుడు రామ్ చరణ్ బాటలోనే అల్లు శిరీష్ కూడా నడుస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా.. సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు విషెస్ చెప్పారు. అభిమానుల విషెస్ పై స్పందించిన అల్లు శిరీష్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తనకు విషెస్ చెప్పిన అందరికీ థాంక్స్ చెబుతూ ఏబీసీడీ సినిమా గురించి కూడా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. మంచి సినిమా అందించడానికి ఎంతో కష్టపడ్డామని.. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు. నాకు సపోర్ట్ చేసిన దర్శకనిర్మాతలకు, ఆడియన్స్ కి థాంక్స్ చెబుతున్నానంటూ ట్వీట్ పెట్టారు.
మొత్తానికి మెగా హీరోలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరి మిగిలిన హీరోలు కూడా తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే.. ఇలాంటి ట్రెండ్ ను ఫాలో అవుతారేమో చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=_h7HAOUNzoQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: