కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా… తాజాగా పోర్చుగల్ షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. దాదాపు ఐదు వారాల పాటు నిరవధికంగా జరిగిన ఈ షెడ్యూల్లో నాగ్, రకుల్, ‘వెన్నెల’ కిషోర్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా.. స్వల్ప విరామం తీసుకుని హైదరాబాద్లో తదుపరి షెడ్యూల్ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని జూలై నెలలోనే విడుదల చేయడానికి నాగ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ సినిమాను ముందుగా ఆగస్టులో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే… ఆగస్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ విడుదల కానుండడంతో… అనవసరమైన క్లాష్ ఎందుకని ‘మన్మథుడు 2’ని అనుకున్న తేదీ కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు… జూలైలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమాను ఆ నెలలోనే విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు వినికిడి. ఏది ఏమైనా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.కాగా… సమంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్కి నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=ruEcJyx3c3M ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: