తనలా ఎవరూ నటించలేదు.. నటించలేరు కూడా… ధనం, కీర్తి అంతటి వైభోగం.. వైభవం తనలా జీవించిన వారు లేరు.. తన నటనతో.. నటనకే అర్థం చెప్పిన నటి.. మహానటి.. ఇప్పటికే ఆమె ఎవరో గుర్తొచ్చే ఉంటుంది. అలనాటి అందాల తార సావిత్రి. తెలుగు తెర చందమామగా అభిమానులతో నీరాజనాలు అందుకున్నారు సావిత్రి. అలాంటి అందమైన జీవితాన్ని ఆఖరి రోజుల్లో విషాదంలా మార్చుకొని.. విషాదమైన మరణాన్ని పొందారు. కానీ ఆమె సినిమాలు.. ఆమె నటన సినీ పరిశ్రమకు ఒక గ్రంధాలయం లాంటివి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అలాంటి అందార తార జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాని తెరకెక్కించారు. ఇక గత ఏడాది ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ నటనపై అందరూ ప్రశంసలు కురిపించారు. విమర్శకులు ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఈవిషయాన్ని కీర్తి సురేష్ సైతం గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.
‘మహానటి’ సినిమాలో నటించడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం. సావిత్రి వంటి గొప్ప నటి పాత్రను, దర్శకుడు నాగ్ అశ్విన్ గారు నన్ను నమ్మి నాకు ఇచ్చారు. ఈ పాత్రను నేను చేయగలను అనే ఆత్మస్థైర్యాన్ని నాకు కలిగించారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరి సహాయ సహకారాలతోనే నేను ఈ పాత్రకి న్యాయం చేయగలిగాను. నాగ్ అశ్విన్ సహా ఈ విజయంలో భాగమైన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.
[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: