యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వల్ మూవీ… ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. దీంతో… ఒక పాట మినహా టాకీ పార్టు మొత్తం పూర్తయింది. కాగా…విదేశాల్లో ఆ గీతాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం. కాగా… మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉన్నత సాంకేతిక విలువలతో పాటు హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కించినట్టు చిత్ర బృందం చెబుతోంది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ‘వెన్నెల’ కిషోర్, మురళీశర్మ తదితరులు ముఖ్య భూమికలను పోషించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం… స్కై హై ఎక్స్పెక్టేషన్స్తో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=2UqswPJbzzA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























