గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’తో అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్… మరోసారి జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ను నిర్మించిన సి.కళ్యాణ్… ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. కాగా.. మే నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో… చెన్నకేశవరెడ్డి
(2002) తరహాలో ఫ్యాక్షనిస్ట్గా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట బాలయ్య. అంతేకాదు… పోలీస్ పాత్ర పేరు ఎస్పీ రంజిత్ కుమార్ రానా అని టాక్. అలాగే… టైటిల్ కూడా ఇదే ఉండొచ్చని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో జగపతి బాబు విలన్గా కనిపించనున్నాడట. ‘లెజెండ్’ సినిమాతో విలన్గా టర్న్ అయి సక్సెస్ఫుల్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతిబాబు… ఇప్పుడు మళ్ళీ బాలయ్యకి విలన్ కానుండడం ఆసక్తిని పెంచే అంశమనే చెప్పాలి. త్వరలోనే జగ్గూ భాయ్ ఎంట్రీపై క్లారిటీ రావచ్చు. కాగా… 2020 సంక్రాంతికి ఈ చిత్రం తెరపైకి రానుంది.
[subscribe]
[youtube_video videoid=Beb6rhfh8Ew]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: