టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్… ఆ మధ్య తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి కోలీవుడ్, బాలీవుడ్లలో వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ భాషల్లో ఆమె నటించిన రెండు సినిమాలు మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాలే ‘దే దే ప్యార్ దే’, ‘ఎన్.జి.కె.’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటిలో ముందుగా ‘దే దే ప్యార్ దే’ అనే హిందీ చిత్రం తెరపైకి రానుంది. అజయ్ దేవగన్, రకుల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కి… అకివ్ అలీ దర్శకత్వం వహించాడు. కాగా… ఈ సినిమా మే 17న విడుదల కానుంది. అలాగే… కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్.జి.కె’లో సూర్యకు జోడీగా నటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మే 31న విడుదల కానుంది.
మొత్తానికి… రెండు వారాల గ్యాప్లో రకుల్ నటించిన ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనున్నాయన్న మాట. మరి… ఈ రెండు చిత్రాలు రకుల్కు ఏ స్థాయి విజయాలను అందిస్తాయో వేచి చూడాలి. ఇదిలా ఉంటే… ప్రస్తుతం తెలుగు చిత్రం ‘మన్మథుడు 2’లో కింగ్ నాగార్జున సరసన రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
[youtube_video videoid=XUCzTPSbNc4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: