`ఆర్ ఎక్స్ 100` వంటి సంచలన చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలతో పాటు ఘనవిజయాన్ని కూడా తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం తన రెండో సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అజయ్. తొలి చిత్రం తరహాలోనే తన మలి సినిమాని కూడా రా సబ్జెక్ట్తోనే తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… మల్టీస్టారర్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులకు స్థానముందని… అందులో ఒకరిగా యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తాడని… మరో కథానాయకుడి పాత్ర కోసం అన్వేషణ సాగుతోందని సమాచారం. కాగా… ఈ సినిమాని మే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. `మహాసముద్రం` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: