మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో భారీ విజయాన్ని అందుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తమన్నా… మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ `సైరా నరసింహారెడ్డి`లో ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే… `క్వీన్` రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే… `అభినేత్రి`, `దటీజ్ మహాలక్ష్మి` తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే… `రాజు గారి గది`చిత్రంతో ఘనవిజయం అందుకున్న యువ దర్శకుడు ఓంకార్… ఆ తరువాత ఆ సినిమాకి సీక్వెల్గా నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో `రాజు గారి గది 2`ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హారర్ కామెడీ సిరీస్లో మూడో చిత్రాన్ని అందించడానికి ఓంకార్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు… ఇందులో ప్రధాన పాత్ర కోసం తమన్నాని సంప్రదించాడని… స్క్రిప్ట్ నచ్చడంతో తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే `రాజు గారి గది 3`కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
[youtube_video videoid=8VSYF73nG6M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: