బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయిన పాయల్ రాజపుత్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . హీరోయిన్ గా మూవీ ఆఫర్స్ అనేకం ఉన్నా పాయల్ సెలెక్టెడ్ గా మూవీస్ కి అంగీకరిస్తున్నారు. లెజండరీ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయసుధ గా అతిథి పాత్రలో పాయల్ నటించారు. సీనియర్ హీరోలు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాలు ఓకే చేశారు. సూపర్ హిట్ మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు2, మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో బయోపిక్ మూవీ లో హీరోయిన్ గా నటించడానికి పాయల్ అంగీకరించారు. వంశీ కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తన దొంగతనాలతో ప్రజలకు నిద్ర లేకుండా చేసిన స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న మూవీ ని అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నా రు. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంపికయ్యారు.
[youtube_video videoid=KIIrIY7G6j4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: