ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా మోటర్స్ మొదటి కారును నిన్న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తుండగా.. మంచు మనోజ్ కూడా దీనిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించి ఓ ట్వీట్ చేశారు. ‘కియా మోటార్స్’ మొదటి వెహికల్ మన ఏపీలో తయారు చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని.. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనిని ఏపీకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి బిగ్ చీర్స్ అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా మనోజ్ చేసిన ట్వీట్ ఎప్పుడు డిలీట్ అయిందో తనకే తెలియదనుకుంటా. ఓ నెటిజన్ మంచు మనోజ్ చేసిన ట్వీట్ ను పోస్ట్ చేస్తూ.. ఎవరు పోర్స్ చేశారు బ్రో ట్వీట్ డిలీట్ చేయడానికి అని కామెంట్ పెట్టాడు. ఇక ఈ ట్వీట్ పై స్పందించిన మనోజ్.. నేను ఇప్పుడే చూస్తున్న ఎలా డిలీట్ అయిందో.. నాకు కూడా తెలీదు.. వెయిట్ అయినా నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు బ్రదర్ అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. మరి నిజంగానే తెలియకుండా డిలీట్ అయిందా.. డిలీట్ చేశారా?
[youtube_video videoid=ruzb2yGEPeo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: