సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2`… యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలచింది. ప్రస్తుతం ఈ మెగా ప్రిన్స్… తమిళ హిట్ చిత్రం `జిగర్తండా` ఆధారంగా తెరకెక్కుతున్న `వాల్మీకి` చిత్రంలో నటిస్తున్నాడు. ఆదివారం విడుదలైన ఈ సినిమా టైటిల్ లోగో ఇంప్రెసివ్గా ఉండడంతో… ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో… ఒరిజినల్ వెర్షన్ లో విలన్ గా నటించిన బాబీ సింహా పాత్రలో కనిపించనున్నాడు వరుణ్. ఇదిలా ఉంటే… ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నాడు. `ఎఫ్ 2` తరువాత వరుణ్, దేవిశ్రీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే కావడం పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు… మెగా కాంపౌండ్ హీరోలతో దేవిశ్రీ చేసిన తొలి, మలి చిత్రాలు మంచి ఫలితాలనే అందుకున్నాయి. `జల్సా`, `గబ్బర్ సింగ్` రూపంలో పవన్ కళ్యాణ్తోనూ… `ఆర్య`, `బన్ని` రూపంలో అల్లు అర్జున్తోనూ… `ఎవడు`, `రంగస్థలం` రూపంలో రామ్ చరణ్తోనూ దేవిశ్రీ చేసిన తొలి, మలి చిత్రాలు కమర్షియల్గా మంచి ఫలితాలను అందుకున్నాయి. మరి… ఇదే సెంటిమెంట్ వరుణ్తో చేస్తున్న రెండో చిత్రంతోనూ డీఎస్పీ కొనసాగిస్తాడేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=4rCiWvKmNQ8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: