కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ ఎమోషనల్ హార్రర్ ఎంటర్ టైనర్ గాతెరకెక్కుతున్న నిను వీడని నీడను నేనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈసారి సందీప్ కిషన్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్దమవుతోంది. ఇక గత కొంత కాలంగా ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిషన్ తొలిసారి నటిస్తోన్న హార్రర్ చిత్రమిది. మనిషి శత్రువుతో యుద్ధం చేస్తాడు కానీ.. మనిషి తన నీడతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కొన్నాడనేదే పాయింట్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. హీరో, హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నాం దీంతో సినిమా పూర్తవుతుంది’ అన్నారు.
నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ.. “దర్శకుడు కార్తీక్ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
కాగా ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, వెన్నెలకిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
[youtube_video videoid=zNulrFJpDl4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: