`లై` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక మేఘా ఆకాష్. ఆ తరువాత `ఛల్ మోహన్ రంగ` చిత్రంలోనూ తన నటనతో యువ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. అయితే… నితిన్ హీరోగా నటించిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. మరో వైపు… తమిళ చిత్రాలతోనూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ… ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం `పేట`లో సిమ్రాన్ కూతురి పాత్రలో సందడి చేసింది. ఇదిలా ఉంటే… మేఘకి ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటించే అవకాశం దక్కిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నేచురల్ స్టార్ నాని హీరోగా `మనం` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం మేఘని వరించిందని ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలోనే మేఘ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: