కీరవాణి తనయులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు తనయుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడగా ఇప్పుడు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీసింహా కూడా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మాతలుగా మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం తెల్లవారితే గురువారం. శ్రీ సింహ, చిత్ర శుక్ల, మిషా నారంగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27 తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ”టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. అయితే మన పిల్లలు కాబట్టి ఇంట్లో వాళ్లు ఏ కొంచెం చేసినా కూడా బాగుందని మాకు అనిపిస్తుంది. కానీ అసలు విషయం మీరు చెప్పాలి. సినిమా ఎలా ఉందనే విషయం మీరు చెప్పాలి. భైరవ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వాడు క్లాస్ మాస్ అయినా ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇక మా చిన్నోడి గురించి మీరు చెప్పాలి.. ట్రైలర్, టీజర్ చూస్తేనే సినిమా చాలా రిచ్గా ఉందని తెలుస్తోంది. నిర్మాతలు అద్భుతంగా నిర్మించారు. మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీశాడు” అని అన్నారు. మరి ఈసినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























