టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరంలో “సరిలేరు నీకెవ్వరు ” , “భీష్మ ” సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు రష్మిక కథానాయికగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్మిక హీరోయిన్ గా పలు భాషల చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను రష్మిక స్పెషల్ గా ప్లాన్ చేశారు. సినీ సెలబ్రిటీస్ న్యూ ఇయర్ వేడుకలను మాల్దీవులు , గోవా లలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీస్ తో కాకుండా రష్మిక తన స్నేహితులతో రెండు రోజుల పాటు గోవా లో న్యూ ఇయర్ వేడుకలను ప్లాన్ చేశారు. రష్మిక ఇప్పటికే తన స్నేహితులతో గోవా చేరుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























