సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సినిమాలకు ఎప్పుడూ వచ్చే ప్రాబ్లమే ఈ సినిమాకు కూడా వచ్చింది. అసలు టైటిల్ తోనే వివాదానికి తెరలేపిన వర్మ.. ఆఖరికి అదే టైటిల్ మార్చాల్సి వచ్చింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ ను మార్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చాయి. సినిమా విడుదలపై హైకోర్ట్ స్టే ఇచ్చింది. సెన్సార్ సభ్యులకు కొంత సమయమిచ్చి పరిశీలించాలని కోరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిపై స్పందించిన వర్మ సెన్సార్ బృందంపై మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా పేరు మార్చాం. రేపు సినిమా చూసి సెన్సార్ చెప్పే అభ్యంతరాలనూ తొలగిస్తాం. నేను జీవితంలో దేన్నైనా సరదాగా తీసుకునే మనిషిని. ఈ సినిమాను జనం సరదాగా చూడాలని కోరుతున్నా. టైటిల్ మార్చమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని పెట్టాం. ఒక సినిమాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్న సెన్సార్పైనా త్వరలో సినిమా తీస్తా. అని అన్నారు. మరి చూద్దాం ఇది సరదాగా అన్నారా..? లేక సీరియస్ గా అన్నారా.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే.
కాగా తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, కేఏ పాల్లను పోలిన నటులు నటిస్తుండగా.. జగన్ పాత్రలో రంగం ఫేం అజ్మల్ అమీర్ ఇంకా అలీ, బ్రహ్మానందం నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: