‘మరుదనాయగం’… లోకనాయకుడు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్. రెండు దశాబ్దాలకు పూర్వమే కమల్ స్వీయదర్శకత్వంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ హిస్టారికల్ డ్రామా… కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. కట్ చేస్తే… ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెలుగులోకి వచ్చింది. అంతేకాదు… ఇందులో ఓ టాలెంటెడ్ స్టార్ ప్రధాన పాత్ర పోషిస్తాడనే ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘మరుదనాయగం’ని పున: ప్రారంభించే దిశగా కమల్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అంతేకాదు… తను చేద్దామనుకున్న పాత్రలో మన `అపరిచితుడు` విక్రమ్ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు విక్రమ్తో కమల్ అండ్ టీమ్ చర్చలు కూడా జరిపారని సమాచారం. ప్రస్తుతం విక్రమ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తైన తరువాత అంటే 2021లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే దిశగా కమల్ ప్లాన్ చేస్తున్నారని తమిళనాట ప్రచారం సాగుతోంది. మరి… కమల్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై, విక్రమ్ ఎంట్రీపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























