ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ (మల్టీప్లెక్స్, ప్రసాద్ లాబ్స్) అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి అక్కినేని విజయలక్ష్మి (77) ఈ రోజు కన్నుమూశారు. గత రాత్రి గుండె పోటుకు గురై నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మద్రాస్ లో పుట్టిన విజయలక్ష్మీ 1963లో రమేష్ ప్రసాద్ ను వివాహమాడారు. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: