దృశ్యం ఫేమ్ జితూ జోసఫ్ డైరెక్షన్ లో కార్తి హీరోగా కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి వదిన అయిన జ్యోతిక కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అందుకే అప్పుడే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని కార్తి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈసినిమాలో సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. వయాకామ్ 18స్టూడియోస్ , పారలాల్ మైండ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇంకా ఈ సినిమాలతో పాటు కార్తి మరో రెండు మూడు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీనితో పాటు రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో ఓ సినిమా చేయనున్నాడు. మరి దేవ్ సినిమాతో కాస్త వెనుకపడ్డ కార్తికి ఈ ఏడాది ఎలా కలిసొస్తుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=_ML0-srkxNg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























