టాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్వీన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. మనసును సేదతీరుస్తూ, ఆత్మను ప్రశాంతం చేస్తూ, కొన్నిసార్లు ప్రపంచం ఇచ్చే ఆ చిన్న విరామం అవసరం అవుతుంది. అదే ఆలోచనతోనే ఇప్పుడు అనుష్క శెట్టి సోషల్ మీడియాలో నుంచి కొంతకాలం దూరమవుతున్నారు. దీనికి సంబంధించి ఆమె తాజాగా ఎక్స్ వేదికగా అభిమానులనుద్దేశించి ఒక స్పెషల్ నోట్ రాశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో.. “నీలి కాంతిని కొవ్వొత్తి కాంతితో మార్చుకుంటూ..” అని చెప్పిన ఆమె, ఇది కేవలం విరామం మాత్రమేనని, మరింత ప్రేమతో, మరింత కథలతో తిరిగి వస్తానని తన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఈ స్క్రోలింగ్ల్లో మునిగిపోయే డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి, అసలు మనం ఎక్కడి నుండి ప్రారంభించామో ఆ బంధాలకు చేరుకోవడమే తన ఉద్దేశమని ఆమె చెబుతున్నారు.
“ప్రపంచంతో మళ్లీ కలిసిపోయేందుకు, మనసుతో మమేకం కావడానికి ఈ విరామం” అని చెప్పిన అనుష్క, తన అభిమానులందరికీ చిరునవ్వుతో, ప్రేమతో ఎల్లప్పుడూ అండగా ఉంటానని సందేశం పంపారు. ఇక చివరగా, “ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండండి… ప్రేమతో, అనుష్క శెట్టి” అంటూ ఆమె రాసిన ఈ స్నేహపూర్వక నోట్, అభిమానుల హృదయాలను తాకేలా ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























