టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. ఆ సినిమాలోని నటనకు గానూ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ మరో ఘనతను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దుబాయ్లోని ప్రతిష్టాత్మక ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే.. అంటే, మార్చి 28వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ దుబాయ్ చేరుకున్నారు. కాగా గురువారం రాత్రి 8 గంటలకు అట్టహాసంగా జరుగనున్న ఈ వేడుకకు బన్నీ కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. అయితే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే మన స్టార్ హీరోలు ప్రభాస్ మరియు మహేష్ బాబు మైనపు విగ్రహాలు కొలువుదీరాయి. కానీ ఇవి లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
ఇక్కడ విశేషం ఏంటంటే..? ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలోని చిత్ర పరిశ్రమలకు చెందిన ఏ ఒక్క నటుడికి సంబంధించిన విగ్రహానికి కూడా ఈ మ్యూజియంలో చోటుదక్కలేదు. తొలిసారిగా అల్లు అర్జున్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. దీంతో ఈ ఘనత సాధించిన తొలి సౌత్ హీరోగా ఆయన నిలిచారు. దీనితోపాటు దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా ఆయనే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్ నుంచి స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్ విగ్రహాలు ఉండటం గమనార్హం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: