యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థ్యాంక్స్ మీట్లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా కంటెంట్ను ఎంతో స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. ‘ఎవరైనా టికెట్ కొంటారా?’ అని మా ఫ్రెండ్స్ అన్నప్పుడు నా మనసు కాస్త కళుక్ మంది. కానీ మేము థియేటర్లు విజిట్ చేస్తూ పల్లెటూర్లలో తిరిగినప్పుడు థియేటర్లలో కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదు. ఫ్యామిలీలతో థియేటర్లు కలకలలాడడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘మేం ఫేమస్’ సినిమాను యూత్ కనెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్ను పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర గారికి థ్యాంక్స్. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 12వ రోజు కూడా హౌస్ఫుల్ రన్ తీసుకుందంటే అది నిర్మాత అభినవ్ గారి వల్లే సాధ్యమైంది. ప్రతి యంగ్ ఫిల్మ్మేకర్కు అభినవ్ గారి లాంటి నిర్మాత దొరకాలి. మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. సినిమాకు వచ్చిన ఫలితంతో చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకోసం కష్టపడ్డ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్యూ. మా నటీనటులకు, టెక్నీషియన్స్కి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. చూడని వాళ్లు తప్పకుండా వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























