టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మహేశ్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘గుంటూరు కారం’ నుండి ఇప్పటికే పలు పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ధమ్ మసాలా’ మరియు ఓ మై బేబీ అనే సాంగ్స్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఫుల్ మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో చూస్తుంటే.. మహేశ్బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులకు థియేటర్లలో మోత మోగడం ఖాయమని అర్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ పాట ఇంత పాపులర్ అయ్యిందంటే దానికి కారణం కుర్చీ తాత. కాలా పాషా అనే ఈయన ఒక సందర్భంలో యథాలాపంగా వాడిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే మాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ డైలాగ్తోనే గేయరచయిత రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో పాట రాశాడు. ఈ నేపథ్యంలో తన డైలాగ్ను గుంటూరు కారం సాంగ్లో పెట్టడంపై తాజాగా కుర్చీ తాత స్పందించాడు. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో తన డైలాగ్ను పాటగా వాడుకోవడం చాలా సంతోషంగా ఉందని, అంత గొప్ప నటుడు నా డైలాగ్ ను వాడుకోవడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని అన్నాడు.
ఇక గుంటూరు కారం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తనను పిలిపించారని, తన కుర్చీ డైలాగ్ను సినిమాలో వాడుతున్నామని ఆయన చెప్పారని తెలిపాడు. అంతేకాక దీనికోసం థమన్ తనకు కొంత మొత్తం ఆర్థిక సాయం కూడా చేశాడని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే, మరికొన్ని గంటల్లోనే కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. గుంటూరు కారం సినిమాలో అన్ని పాటల్లోకి ఈ సాంగ్ హైలెట్గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదని మహేశ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
— #GunturKaaram 🌶️ (@alluanjayya) December 29, 2023
కాగా ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: