టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంటరైంది. కాగా ఈ చిత్రంలో తొలుత హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోగా.. ఏవో కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో పూజాకి, మూవీ యూనిట్కి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఆమెని తప్పించారని రకరకాల రూమర్స్ వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘గుంటూరు కారం’ చిత్రాన్ని మొదట ఆగస్టులో విడుదల చేయాలనుకున్నాం. ఆ తర్వాత వచ్చే యేడాది జనవరి 12కు రిలీజ్ చేద్దామని నిర్ణయించాం. ఎలాంటి కంగారు లేకుండా నెమ్మదిగా షూటింగ్ చేయొచ్చని భావించాం. అయితే ఆ సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి రావడంతో.. ఈ రెండు సినిమాలకు తన డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. దీంతో పూజాను రీప్లేస్ చేశాం. డేట్స్ సర్దుబాటుకాకపోవడమనేది తప్పిస్తే ఇందులో మరెలాంటి సమస్యలు లేవు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని రీప్లేస్ చేయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు” అని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన ఇలా చెప్పారు.. “కానీ కొందరు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేశారు. ఈ మాత్రానికే అంత హంగామా చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థంకాదు. పండగ సీజన్ కు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో మహేశ్ బాబు క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతానికి రెండు సాంగ్స్ రెడీ అయ్యాయి. అక్టోబర్ 20 నాటికి షూటింగ్ పూర్తవ్వొచ్చు. ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేస్తాం. ‘గుంటూరు కారం’ సినిమాని వచ్చే సంక్రాంతికి పక్కాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని నాగవంశీ తెలిపారు. కాగా అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ‘గుంటూరు కారం’లో సీనియర్ నటుడు జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న పాన్-వరల్డ్ మూవీలో నటించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణ కథాంశంగా ఈ సినిమా ఉండనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: