టాలెంటెడ్ నటుల్లో తమిళ హీరో ధనుష్ ఒకరు. ధనుష్ తమిళంలోనే కాక దేశంలోని అనేక భాషా చిత్రాలలో నటించి తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలలో విభిన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి మరియు ఇద్దరు కుమారులు యాత్ర, లింగాతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చిన ధనుష్.. తల నీలాలను సమర్పించారు. అలాగే మెడలో రుద్రాక్ష మాలను ధరించారు. అయితే ధనుష్ కొత్త లుక్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ధనుష్
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ధనుష్
Hero #Dhanush visits Tirumala to seek divine blessings and also gets tonsured.#CaptainMiller #TeluguFilmNagar
Posted by Telugu Filmnagar on Monday, 3 July 2023
కాగా ధనుష్ చివరిసారిగా తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘వాతి’లో కనిపించారు. ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాలో పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారు. 1930ల కాలంనాటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఆ తర్వాత దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ అనే హిందీ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ధనుష్ త్రిభాషా చిత్రం కూడా చేయబోతున్నారు. ఇక మరోవైపు ధనుష్ తన 50వ (D50) చిత్రంగా స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ఎస్జె సూర్య సహా మరికొందరు ప్రముఖ పరభాషా నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: