స్మార్ట్ఫోన్ నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త థ్రిల్లర్ మూవీ ‘మాయాపేటిక’. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఫేమ్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాజ్ అశ్విన్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ తదితరులు ఇతర తారాగణం. ప్రముఖ నటుడు సునీల్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ మరియు శ్రీనివాస రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై మరింత ఆసక్తి రేకెత్తించింది. కాగా ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తుండగా.. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఎంతగా ప్రభావం చూపిస్తుందో ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ప్రేమ, అధికారం, డబ్బు వీటితో పాటు మనిషికి తప్పని నాలుగో అవసరంలా సెల్ ఫోన్ మారిందని ఫోన్ మాట్లాడుతూ చెప్పడం ఆకట్టుకుంటుంది. మొత్తం నాలుగు కథల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వారందరికీ, ఈ ఫోన్ కీ ఉన్న కనెక్షన్ ఏంటి.. ? అనేది సస్పెన్స్ గా కనిపిస్తుంది. ఇక ఇందులో పాయల్ రాజ్ పుత్.. సినిమాలో కూడా హీరోయిన్ గానే నటిస్తుండగా.. ముస్లీమ్ మెకానిక్ గా విరాజ్ కనిపించాడు. అలాగే సునీల్ ఆటో డ్రైవర్ గా.. శ్రీనివాస రెడ్డి కోతులను ఆడించేవాడిగా చూపించారు. ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి ఒక సందర్భంలో లేడీ గెటప్ లో కనిపించడం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈ నలుగురు జీవితాల్లో స్మార్ట్ ఫోన్ ఎలాంటి పాత్ర పోషించింది? చివరికి ఆ నాలుగు కుటుంబాలు ఏమయ్యాయి? అనేది తెలుసుకోవాలంటే.. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వస్తోన్న మాయాపేటిక సినిమా చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: