కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసుకుంది. పార్ట్ 1 కు నార్త్ లో ఎలాగైతే మంచి రెస్పాన్స్ వచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టిందో.. పార్ట్ 2 కూడా నార్త్ లో తొలి రోజు నుంచే బాక్సాఫీస్ షెక్ చేసి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈరెండు సీక్వెన్స్ సక్సెస్ అయ్యాయి కాబట్టి మూడో పార్ట్ ను తీయనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సీక్వెన్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈసినిమాను వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. తనకున్న కమిట్ మెంట్స్ ను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు 2024 ప్రారంభించి 2025 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ 31 సినిమా చేయనున్నాడు ప్రశాంత్ నీల్. మరి ఈసినిమా అయిపోయినప్పుడు కె.జి.యఫ్3 మొదలుపెడతాడేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: