ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈమధ్య అల్లరి నరేష్ సీరియస్ కథలనే ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. నాంది సినిమా సీరియస్ మోడ్ లోనే ఉంటుంది. అలానే ఈమధ్య వచ్చిన ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం సినిమా కూడా మెసేజ్ ఒరియెంటెడ్ సినిమానే. ప్రస్తుతం తను ఉగ్రం సినిమా అలానే సభకు నమస్కారం సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఉగ్రం సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ అని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి అర్థమవుతుంది. సభకు నమస్కారం సినిమా కూడా ఇదే కోవలోకి వెళుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం అల్లరి నరేష్ మళ్లీ తన బలమైన కామెడీ జోనర్ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అన్నీ సీరియస్ కథలే చేస్తుండటంతో మధ్యలో మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్ తో రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఒక న్యూ ఏజ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అంతేకాదు జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తో చర్చలు జరిపినట్టు.. ఓ మంచి కథను తయారు చేయమని చెప్పినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం అల్లరి నరేష్ ఏ కామెడీ ఎంటర్ టైనర్ తో.. ఏ డైరెక్టర్ తో వస్తాడో?
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: