ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ఒకవైపు కె.జి.యఫ్ డైరెక్టర్ మరోవైపు ప్రభాస్ హీరో కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో ఆద్య పాత్రలో నటిస్తుంది శృతి హాసన్. తాజాగా ఈసినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది శృతి హాసన్. ఈసినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలిపింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన గౌడ్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను.. ఆద్యగా నన్ను మార్చినందుకు థ్యాంక్స్.. ఇలాంటి స్పెషల్ సినిమాలో నటించడం లవ్లీ ఎక్స్ పీరియన్స.. చిత్రయూనిట్ పాజిటివిటీ తో పాటు ఒక ఫ్యామిలీ లాంటి అనుభూతి ఇచ్చింది అని తెలిపింది.
View this post on Instagram
కాగా ఈసినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: